తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు
బుధవారం పాలమూరు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని
అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హైదరాబాదు నుంచి బయలుదేరి నాగర్కర్నూల్
నియోజకవర్గంలోని తిమ్మాజిపేట మండలం, నేరళ్లపల్లిలో గ్రామజ్యోతి
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు
గ్రామంలో 33/11 కె.వి. సబ్స్టేషన్ నిర్మాణం, సీసీరోడ్లు, మురుగుకాల్వల
నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు. అదే విధంగా మంచినీటి ఎద్దడి
నివారణ కోసం నిర్మించిన వాటర్ట్యాంక్ను, పంచాయతీ భవనాన్ని
ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు. తక్కువ విద్యుత్ను వినియోగించే
సీఎఫ్ఎల్ వీధిదీపాలను వెలిగిస్తారు.