Thursday, 10 September 2015
రాజస్థాన్, అహ్మదాబాద్ లో కూడా మాంసం బ్యాన్
గోమాంసం, ఇతర మాంసం అమ్మకాలపై నిషేధం రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, అహ్మదాబాద్ లకు కూడా విస్తరిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో స్వయంగా హైకోర్టే నిషేధం విధించింది. ఇక రాజస్థాన్ ఈ నెల 17,18, 27 తేదీల్లో జైన్ ల పండుగ సందర్భంగా మాంసం, చేపల అమ్మకాన్ని నిషేధించింది. ఆ రోజుల్లో దుకాణాలు తెరవకూడదని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. 17న జైన్ ఉపవాసదీక్షాదినం ప్రయుషన్ , సెప్టెంబర్ 18న మరో జైన్ పండుగ సంవత్సరి, సెప్టెంబర్ 27న అనంత చతుర్థశి నేపథ్యంలో ఈ నిషేధం విధించింది. కబేళాలకూ ఈ నిషేధం వర్తిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో హై కోర్టు నిషేధం విధించడంతో జమాయిత్ ఈ ఇస్లామీ, సంస్థ, హురియత్ కాన్ఫరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ లో పోలీసు కమిషనర్ సత్యానంద్ ఝా వారం రోజుల పాటు కోళ్లు, గొర్రెలతో పాటు అన్ని జంతువుల వధను నిషేధించారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment