Wednesday, 2 September 2015

చీప్ లిక్కర్ పై వెనకడుగు

 

చీప్ లిక్కర్ పై విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కితగ్గింది. నిన్నటి కేబినెట్ భేటీలో నూతన మద్యం పాలసీపై నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ ఏడాదికి పాత మద్యం విధానాన్నే అమలు చేస్తామని సీఎం తెలిపారు. ప్రత్యామ్నాయ పానియం లేకుండా గుడుంబాను అరికట్టలేమన్న ఆయన.. చీప్ లిక్కర్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందన్నారు. కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అధ్యక్షత సుమారు 4 గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

No comments:

Post a Comment