Wednesday, 26 August 2015
హింసాత్మకంగా మారిన పటేళ్ల ఆందోళన
గుజరాత్లో పటేల్ సామాజికవర్గం ఆందోళన హింసాత్మకంగా మారింది. బుధవారం బంద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. తమను ఓబీసీలుగా గుర్తించాలని హార్ధిక్ పటేల్ నేతృత్వంలో పటేల్ సామాజికవర్గం కొంతకాలంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం అహ్మదాబాద్లో పటేళ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం గుజరాత్ బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మంగళవారం రాత్రి హార్ధిక్ పటేల్ను పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ వార్త తెలియగానే ఆందోళనకారుల చెలరేగిపోయారు. పోలీసులు వెనక్కి తగ్గినా మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. దీంతో బుధవారం రాష్ట్ర బంద్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగింది. పలు చోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు నడుమ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ సహా పలు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. పోలీసుల కాల్పుల్లో అహ్మదాబాద్లో ముగ్గురు, బనసకాంత జిల్లాలో ముగ్గురు చొప్పున మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఘటోల్డియాలో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి మరణించాడు. సూరత్లో ఆందోళనకారుల దాడిలో ఓ పోలీసు మృతి చెందారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment