Friday, 28 August 2015

అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ ‘స్పాట్ ఫిక్సింగ్’ ఆటగాళ్లు


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ను ఉలిక్కిపడేలా చేసిన ఈ ముగ్గురు పాక్ క్రికెటర్లు మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ లో సందడి చేయనున్నారని పీసీబీ పెద్దలు అంటున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ ఆసిఫ్, సల్మాన్ భట్, మహ్మద్ అమీర్ పై విధించిన నిషేధం సెప్టెంబర్ 1తో ముగియనుంది. 2010లో ఇంగ్లండ్ తో సిరీస్ ఆడిన సందర్భంగా వీరి స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఓ స్థానిక న్యూస్ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి తెచ్చింది. వీడియో పుటేజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో వీరు ముగ్గురికి ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది. సెప్టెంబర్ 1తో వీరిపై నిషేధం ముగియనుండడంతో లాహోర్ లోని హెడ్ ఆఫీస్ లో వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. త్వరలో పీసీబీ వారిని మళ్లీ క్రీజులోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.

No comments:

Post a Comment