మోనెటా (అమెరికా), ఆగస్టు 26:
అమెరికాలో తుపాకి సంస్కృతి పెరుగుతున్నదని విమర్శలు చెలరేగుతున్న
తరుణంలోనే అమెరికాలో ఇద్దరు టెలివిజన్ జర్నలిస్టులను ఆగంతకులు దారుణంగా
కాల్చి చంపారు. ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహిస్తున్న డబ్ల్యూబీజే-7
టెలివిజన్ ప్రతినిధులపై ఆగంతకులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు.
వర్జీనియాలో బుధవారం ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఈ
దుర్ఘటనలో రిపోర్టర్ అలిసన్ పార్కర్ (24), కెమెరామెన్ ఆడం వార్డ్ (27)
మృత్యువాత పడ్డారని టెలివిజన్ మేనేజర్ జెఫరీ ఏ మార్క్ తెలిపారు.
బెడ్ఫోర్డ్ కౌంటీలో ఉన్న బ్రిడ్జ్వాటర్ ప్లాజా, ఓ షాపింగ్, రిక్రియేషన్
ప్లాజాలో టూరిజానికి సంబంధించిన కార్యక్రమాన్ని చిత్రీకరిస్తుండగా ఆగంతకులు
కాల్పులు జరిపినట్లు జెఫరీ తెలిపారు. కాల్పులకు బాధ్యులెవరో.. ఎందుకు ఈ
చర్యకు పాల్పడ్డారో అనే విషయంపై ఇంకా స్పష్టత లభించలేదన్నారు.
-అమెరికాలో దారుణం
-ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్, కెమెరామెన్పై కాల్పులు
-ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలోనే ఘటన
ఓ
వ్యక్తిని పార్కర్ నవ్వుతూ ఇంటర్వ్యూ చేస్తుండగా కాల్పుల శబ్దం
వినిపించిందని, దాంతో భయాందోళనకు గురైన పార్కర్ కేకలు పెడుతూ ఓ మై గాడ్
అంటూ పరుగెత్తుతున్న దృశ్యాలు వీడియో ఫుటేజీలో కనిపించాయని జెఫరీ
పేర్కొన్నారు. మృతులిద్దరికి ఈ మధ్యనే నిశ్చితార్థం జరిగింది. పెండ్లికి
ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో టెలివిజన్
సంస్థ సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. కాల్పుల సమయంలో కింద పడిన
కెమెరాలో.. నల్లటి ప్యాంట్, బ్లూ షర్ట్ ధరించి తుపాకిని పట్టుకున్న
షూటర్లకు సంబంధించిన అస్పష్టమైన చిత్రాలు రికార్డయ్యాయి. నిందితుల కోసం
పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
-ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్, కెమెరామెన్పై కాల్పులు
-ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలోనే ఘటన
No comments:
Post a Comment