Sunday, 23 August 2015

Train Accident In Anantapur One Died

Train Accident In Anantapur One Died



అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో ఈ రోజు ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మడకశిర రైల్వేగేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. గ్రానైట్‌తో వెళుతున్న ఓ లారీ అదుపు తప్పి మడకశిర లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హెచ్‌1 బోగిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గ్రానైట్‌ రాయి రైలు బోగిపై పడిపోయి దెబ్బతింది. ఈ సంఘటనలో మరో రెండు బోగీలు పక్కకు పడిపోయాయి. లారీ డ్రైవరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుల్లో హెచ్‌1 బోగి ఏసీ టెక్నిషియన్‌ అహ్మద్‌, కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ్‌ ఎమ్మెల్యే వెంకటేష్‌నాయక్‌లు ఉన్నారు. ఈ ప్రమాదం ఉదయం 2.30 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీంలు ప్రమాద స్థలానికి చేరుకోని సహయ చర్యలు చెపట్టారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు- గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కల్లూరులో. ముంబయి- బెంగళూరు ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను తాడిచెర్లలో, బీదర్‌-యశ్వంత్‌పూర్‌ రైలును గార్లదిన్నెలో, నిజాముద్దీన్‌- బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను అనంతపురంలో నిలిపివేశారు. రైల్వే అధికారులు వచ్చి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.

No comments:

Post a Comment