Tuesday, 25 August 2015
Terrorist Blasted Bombs In Hyderabad 8 Years Ago
హైదరాబాద్ లో ఉగ్రవాదులు గోకుల్ చాట్, లుంబినీ పార్కుల్లో పేలుళ్లు జరిపి నేటికి సరిగ్గా ఎనిమిదేళ్లు. ప్రశాంతంగా ఉండే భాగ్యనగరం ఈ పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదులు విసిరిన పంజా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలైన లుంబినీ పార్క్, గోకుల్ చాట్ లో పేలుళ్లు జరిగాయి. ఆ రెండు ఘటనల్లో 42 మంది చనిపోగా..వందలాది మంది గాయపడ్డారు. ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి.. దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. గాయపడ్డవారిలో కొందరు ఇప్పటికీ జీవశ్చవాలుగా బతుకీడుస్తున్నారు. వారికి నేటికీ ప్రభుత్వ సాయం అందలేదు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment